సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాల జోనల్ ఇన్చార్జిలను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆమేరకు తిరుపతి, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు యువజన విభాగం రీజనల్ ఇన్చార్జిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నియమితులయ్యారు. రైతు విభాగం జోనల్ ఇన్చార్జిగా మావులూరి శ్రీనివాసులు రెడ్డి, బీసీ సెల్కు తొండమల్ల పుల్లయ్య, వైఎస్సార్టీయూసీకి నారపరెడ్డి రాజారెడ్డి, పంచాయతీరాజ్ విభాగానికి చీర్ల సురేష్యాదవ్, ఎస్టీ సెల్కు చెవురు పద్మ, మైనారిటీ సెల్కు సయ్యద్ హంజా హుస్సేని, విద్యార్థి విభాగానికి లెక్కల రాజశేఖర్ రెడ్డి, వికలాంగుల విభాగానికి కొమ్మిరెడ్డి శివారెడ్డి, వైఎస్సార్ సేవాదళ్కు షేక్ మహ్మద్ రఫీ, వైద్యుల విభాగానికి డాక్టర్ అమీర్ బాషా, వాణిజ్య విభాగానికి చందోలు సతీష్, సాంస్కృతిక విభాగానికి ఎస్.కృష్ణవేణి, ప్రచార విభాగానికి డి. బీరేంద్రవర్మ, మహిళా విభాగానికి రత్నకుమారి, గ్రీవెన్స్ సెల్కు పోకల రామకృష్ణారెడ్డి, వీవర్స్ వింగ్కు మిద్దెల హరి జోనల్ ఇన్చార్జిలుగా నియమితులయ్యారు.