Ship Carrying Migrants Sinks Off Greece Coast: వలసదారులతో వెళుతున్న పడవ గ్రీకు ద్వీపం ఆంటికిథెరాకు ఉత్తరాన ఉన్న ద్వీపంలో మునిగిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో సుమారు 11 మంది దుర్మరణం చెందారని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ ప్రమాదంలో చిక్కుకున్న దాదాపు 90 మందిని రక్షించినట్లు వెల్లడించారు.
(చదవండి: చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప!!)
అయితే అక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని చెప్పారు. ఈ మేరకు పడవ మునిగిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా స్పష్టం కాలేదని అధికారులు తెలిపారు. అయితే ప్రజలు తమ మనుగడను వెతుక్కుంటూ ప్రమాదకరమైన ప్రయాణాలను కొనసాగిస్తున్నారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ (యూఎస్హెచ్సీఆర్) ప్రతినిధి అసిస్టెంట్ అడ్రియానో సిల్వెస్ట్రీ ఆందోళన వ్యక్తం చేశారు.
(చదవండి: పూజారి వేషంలో మాదక ద్రవ్యాల వ్యాపారం... 7 కిలోల గంజాయి పట్టివేత!!)