వలసదారుల పడవ బోల్తా: 11 మంది దుర్మరణం

24 Dec, 2021 20:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

Ship Carrying Migrants Sinks Off Greece Coast: వలసదారులతో వెళుతున్న పడవ గ్రీకు ద్వీపం ఆంటికిథెరాకు ఉత్తరాన ఉన్న ద్వీపంలో మునిగిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో సుమారు 11 మంది దుర్మరణం చెందారని కోస్ట్ గార్డ్  అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ ప్రమాదంలో చిక్కుకున్న దాదాపు 90 మందిని రక్షించినట్లు వెల్లడించారు.

(చదవండి: చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప!!)

అయితే అక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోందని చెప్పారు. ఈ మేరకు పడవ మునిగిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా స్పష్టం కాలేదని అధికారులు తెలిపారు.  అయితే ప్రజలు తమ మనుగడను వెతుక్కుంటూ ప్రమాదకరమైన ప్రయాణాలను కొనసాగిస్తున్నారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్‌ (యూఎస్‌హెచ్‌సీఆర్‌) ప్రతినిధి అసిస్టెంట్ అడ్రియానో ​​సిల్వెస్ట్రీ ఆందోళన వ్యక్తం చేశారు.

(చదవండి: పూజారి వేషంలో మాదక ద్రవ్యాల వ్యాపారం... 7 కిలోల గంజాయి పట్టివేత!!)

మరిన్ని వార్తలు