కూకట్‌పల్లిలో విషాదం: ఆట మధ్యలో ఫోన్‌ లాక్కున్నారని బాలుడు ఆత్మహత్య

26 Jun, 2021 15:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఫోన్‌లో ఓ ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసై 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌ క్లాసుల కోసం బాలుడికి తల్లిదండ్రులు ఫోన్‌ కొనిచ్చారు. అయితే, క్లాసులు వినకుండా ఫోన్‌లో గేమ్‌లు ఆడేందుకు బాలుడు బానిసయ్యాడు. దీంతో అతను మరోసారి ఫోన్‌లో గేమ్‌ ఆడుతుండగా, ఆట మధ్యలో తల్లిదండ్రులు ఫోన్‌ లాక్కున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలుడు శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు
నన్ను చంపుతున్నారు.. రక్షించండంటూ ఆర్తనాదాలు

మరిన్ని వార్తలు