Road Accident: టిప్పర్ బోల్తా.. 13 మంది కూలీల దుర్మరణం

20 Aug, 2021 15:14 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుల్ధానాలోని సమృద్ది ఎక్స్‌ప్రెస్  హైవేపై టిప్పర్ బోల్తా పడిన ఘటనలో 13 మంది కూలీలు  మృత్యవాత పడ్డారు. ఐరన్ లోడుతో వెళ్తున్న టిప్పర్‌పై  కూలీలు కూర్చొన్నారు. టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడడంతో టిప్పర్‌పైన కూర్చొన్న కూలీలు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి:వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ హత్యకేసు: ఆర్థిక లావాదేవీలే కారణం

మరిన్ని వార్తలు