అత్యాచారం వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌

31 Jan, 2021 15:35 IST|Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహితకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేయటమే కాకుండా.. వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డారు కొందరు. పాల్వంచలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 18న పాల్వంచకు చెందిన ఓ వివాహితపై ఇ‍ద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. వీరికి ముగ్గురు మహిళలు సహాయం చేశారు. అత్యాచార దృశ్యాలను వీడియో తీసిన కళావతి అనే మహిళ బాధితురాలిని బ్లాక్‌ మెయిల్‌ చేయసాగింది. దీంతో ఆమె పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

చదవండి : కొడుకు కోసం 24 మందిని మోసం చేసింది

మరిన్ని వార్తలు