తాగుబోతు తల్లి వేధింపులు భరించలేక..

17 Sep, 2020 17:36 IST|Sakshi
సంఘటనా స్థలం వద్ద ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

భువనేశ్వర్‌ : తాగుబోతు తల్లి వేధింపులు భరించలేక దారుణానికి ఒడిగట్టారు ఇద్దరు మైనర్లు. కన్నతల్లిని పాశవికంగా హత్య చేసి, బాత్‌రూంలో పడేశారు. ఈ సంఘటన బుధవారం రాత్రి ఒడిశాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భువనేశ్వర్‌కు చెందిన ఓ మహిళ అక్కడి సుందర్‌పాద ఏరియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు మైనర్‌ కుమారులతో కలిసి ఉంటోంది. ప్రతి నిత్యం ఆమె మద్యం తాగివచ్చి ఆ ఇద్దర్నీ హింసించేది. ఈ నేపథ్యంలో తల్లిపై  పగ పెంచుకున్నారు వారు. బుధవారం రాత్రి ఫుల్లుగా తాగి వచ్చిన ఆమె.. వారిపై అరవటం మొదలుపెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు పాలిథిన్‌ కవరుతో తల్లి ముఖాన్ని కప్పేసి, రాడ్డుతో తలపై బలంగా కొట్టారు. ( కోల్డ్ బ్లడెడ్ మర్డర్ : ఆచూకీ చెబితే ఎఫ్‌బీఐ రివార్డు )

ఊపిరాడని స్థితిలో.. రక్తం ఎక్కువగా పోవటంతో ఆమె అక్కడికక్కడే మృత్యువాత పడింది. తల్లి చనిపోయిందని నిర్థారించుకున్న మైనర్లు ఆమె శవాన్ని బాత్‌రూంలో పడేసి, పెంపుడు కుక్కను తీసుకుని  అపార్ట్‌మెంట్‌ గార్డు దగ్గరకు పరిగెత్తారు. తమ ఇంట్లోకి చొరబడ్డ కొందరు దుండగులు తల్లిని కొట్టి చంపారని అతడితో చెప్పారు. గార్డు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.​ అనంతరం పోలీసుల విచారణలో ఆ ఇద్దరు మైనర్లు తల్లిని తామే చంపినట్లు ఒప్పుకున్నారు.

మరిన్ని వార్తలు