మత సమైక్యత, సుహృద్భావానికి తూట్లు పడేలా కొందరి చర్యలు సమాజంలో కల్లోలానికి కారణమవుతున్నాయి. వట్టి వదంతులతోనే అల్లర్లకు దిగడం, ఆస్తి నష్టానికి పాల్పడడం, ఆపై రావణకాష్టంలా అది కొనసాగడం కొన్ని జిల్లాలకు సమస్యగా మారింది. మల్నాడు, కోస్తా, పలు ఉత్తర కర్ణాటక జిల్లాల్లో కలహాల బెడద ఎక్కువగా ఉంటోంది.
బనశంకరి: రౌడీయిజంలో ఉడుపి, కోలారు, అగ్రస్థానంలో నిలిచాయి. ఈ జిల్లాల్లో అత్యధికంగా రౌడీయిజం ఆధారిత కేసులు నమోదు కాబడ్డాయి. ఉడుపి జిల్లాలో గత ఐదేళ్లలో 431 కేసులు నమోదు కాగా, కోలారు జిల్లాలో 165, ఆ తరువాత దక్షిణ కన్నడ జిల్లాలో 152 కేసులు, బెంగళూరు నగర 60, కలబురిగి 97, శివమొగ్గ 156 నేరాలు జరిగాయి.
అత్యధికంగా శివమొగ్గ జిల్లాలో..
సోషల్ మీడియా ఎఫెక్టు ..
ఇందులో సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంది. ఎక్కడో జరిగిన సంఘటనలను ఇక్కడే జరిగాయని కొందరు మసిపూసి పోస్ట్ చేయడం, అవి వైరల్గా మారి కల్లోలం చెలరేగడం పరిపాటిగా మారింది. అవి ఫేక్ వీడియోలు అని చెప్పినప్పటికీ ఆవేశంలో యువత నమ్మడం లేదు. మరో వర్గానికి చెందినవారిని దారి కాచి దాడి చేయడం ఆస్తులను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదముంది.
గొడవల్లో 380 మంది పోలీసులకు గాయాలు
(చదవండి: పేసీఎం పోస్టర్పై ఫోటో.. కాంగ్రెసకు వార్నింగ్ ఇచ్చిన నటుడు)