చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

3 Nov, 2020 16:38 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మదనపల్లి సమీపంలోని బండకిందపల్లి వద్ద ప్రైవేట్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మదనపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన వారిని సోమశేఖర్, మల్లికార్జున, గంగుల్లప్పగా గుర్తించారు.  (కర్నూలు జిల్లాలో నలుగురు ఆత్మహత్య)

మరిన్ని వార్తలు