ల్యాప్‌టాప్‌ కీబోర్డులో పట్టుబడ్డ రూ. 1.3 కోట్ల బంగారం

13 May, 2022 20:22 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు విమానాశ్రంయలో ల్యాప్‌టాప్‌లో దాచిన సుమారు 1.3 కోట్ల విలువైన బంగారం దొరికింది. తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు చెందిన ల్యాప్‌టాప్‌లో దాదాపు ₹ 1.3 కోట్ల విలువైన బంగారాన్ని దాచి ఉంచారని పోలీసులు తెలిపారు.

ముగ్గురు ప్రయాణికులు నుంచి సుమారు రూ. 1.98 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ల్యాప్‌టాప్‌ కీబోర్డు కింద ఉండే ప్రాంతంలో బంగారాన్ని దాచినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు మే 11న షార్జా మీదుగా భారత్‌కు చేరుకున్న ఆ ముగ్గురు ప్రయాణికులను కస్టమ్స్‌ విభాగం అరెస్టు చేసింది. 

(చదవండి: పెళ్లి ఊరేగింపులో విషాదం...వధువు తల్లిని కత్తితో పొడిచి...)

మరిన్ని వార్తలు