మృత్యు రూపంలో వచ్చిన మరో కారు!

24 Jul, 2020 18:58 IST|Sakshi

మునగాల చెరువు వద్ద కారు ప్రమాదం, ముగ్గురు మృతి

సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని మునగాల వద్ద శుక్రవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. మునగాల చెరువు వద్ద హైవే పక్కన కారు ఆపి కిందకు దిగిన కుటుంబాన్ని మృత్యు రూపంలో వచ్చిన మరో కారు ఢీకొట్టింది. భార్యాభర్తలు, వారి పదేళ్ల పాప కూడా తీవ్ర గాయాలతో ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచారు. వీరంతా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

మరిన్ని వార్తలు