బెంగళూరు : చిన్న చిన్న కారణాలకే విలువైన జీవితాలను అంతం చేసుకుంటున్నారు కొందరు. బంధుమిత్రులకు తీరని విషాదం మిగుల్చుతూ హోసూరు పట్టణంలో వేర్వేరు సమస్యలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్నారు. హోసూరులోని కుప్పుస్వామి నగర్కు చెందిన పుష్పరాజ్ కూతురు శ్రీ అపూర్వ(32)కు అరుణ్కుమార్తో మూడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఒక కొడుకున్నాడు. కొడుకు పుట్టినరోజును ఘనంగా జరుపుదామని అపూర్వ భర్తను కోరింది. అతడు నిరాకరించడంతో విరక్తి చెంది ఉరివేసుకొంది. వెంటనే గమనించి ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది.