Hyderabad: ఆడుకుంటున్న చిన్నారిని.. నాన్నను చూపిస్తామని తీసుకెళ్లి

23 Dec, 2021 18:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్ రెజిమెంటల్‌ బజార్‌లో బాలిక కిడ్నాప్‌ ఘటన కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కీర్తనను..  గుర్తుతెలియని వ్యక్తులు మీ నాన్నను చూపిస్తామంటూ మాయమాటలు చెప్పారు. ఆ తర్వాత పాపను బైక్‌మీద ఎక్కించుకొని తీసుకెళ్లారు.

స్థానికురాలు ఒకరు బాలికను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌మీద తీసుకెళ్లినట్లు గమనించింది. ఆ తర్వాత వెంటనే..  చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 

చదవండి: ఫోన్‌ కొట్టేశాడని ఏకంగా తలకిందులుగా వేలాడదీశారు...ఐతే చివరికి!!

మరిన్ని వార్తలు