బిహార్‌లో కాల్పుల కలకలం..ఒకరు మృతి

16 Sep, 2022 14:12 IST|Sakshi

పట్నా: బిహార్‌లో నలుగురు వ్యక్తులు తుపాకీలతో కాల్పుల కలకలం సృష్టించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్‌లోని బెగుసురాయ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....బిహార్‌లోని బెగుసురాయ్‌లో బాటసారులపై నలుగురు దుండగులు కాల్పులు జరిపారని అన్నారు.

వారు బైక్‌పై వచ్చి ఈ కాల్పులు  జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు...సుమిత్‌ కుమార్‌, యువరాజ్, కేశవా అలియాస్‌​ నాగా, అర్జున్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్ల వెల్లడించారు.

ఈ ఘటన తర్వాత అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 7గురు పోలీసులను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఆ దుండగులు మొదటగా బెగుసురాయ్‌ పట్టణంలోని మల్హిపూర్‌ చౌక్‌లో షాపులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ నిందితులు బరౌని థర్మల్‌ చౌక్‌, తేఘ్రా, బచ్వారా, రాజేంద్ర బ్రిడ్జి వరకు కాల్పులు కొనసాగించినట్లు వెల్లడించారు. 

(చదవండి: బిహార్‌లో మద్యం నిషేధం విఫలం)

మరిన్ని వార్తలు