ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

9 Nov, 2020 10:39 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. సత్నా జిల్లా వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన ట్రక్కు కారును ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.   (జగిత్యాల జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం)

మరిన్ని వార్తలు