ఏసీబీ వలలో కాటారం తహశీల్ధార్‌

22 Jul, 2021 19:12 IST|Sakshi

రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మేడిపల్లి సునీత

సాక్షి, భూపాలపల్లి: కాటారం తహశీల్దార్ మేడిపల్లి సునీత 2లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఐత హరికృష్ణకు చెందిన కొత్తపల్లి శివారులోని సర్వే నెంబరు-3 లో భూమికి ఆన్‌లైన్‌ చేసి, పట్టా పాస్ బుక్కుల కోసం 3 లక్షలు తహశీల్దార్‌ డిమాండ్ చేశారు. చివరకు రూ. 2 లక్షలు తీసుకుంటూ సునీత.. ఏసీబీ అధికారులకు చిక్కారు. 

మరిన్ని వార్తలు