నెల్లూరు మున్సిపల్‌లో ఏసీబీ తనిఖీలు

18 Aug, 2021 14:29 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తనిఖీలు కలకలం రేపాయి. నెల్లూరు పట్టణంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ సోదాలు చేసింది. ఈ సందర్బంగా కార్యాలయంలోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. పలు పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు