సాక్షి, అమరావతి: ఇంద్రకీలాద్రిపై నకిలీ సర్టిఫికెట్ల ఘటన కలకలం రేపుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో పని చేస్తున్న ఉద్యోగులను ఆలయ అధికారులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించగా వారిని ఈఓ భ్రమరాంబ సస్పెండ్ చేశారు. అందులో ఒకరు సీనియర్ ఆసిస్టెంట్, మరొకరు జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు.