టీటీడీ, ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం.. 18 మందిపై కేసు

13 Aug, 2021 19:47 IST|Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేస్తున్న 18 మందిపై కేసులను నమోదు చేసినట్లు ఏపీ పోలీసులు తెలిపారు. కాగా, టీటీడీ దేవస్థానానికి చెందిన 1500 కేజీల బంగారాన్ని తాకట్టుపెట్టి.. ఏపీ ప్రభుత్వం అప్పుతీసుకున్నట్లు కొంత మంది సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.

ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించడం పట్ల పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణించారు. అయితే, 18 మంది నిందితులపై కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు