మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి.. మూడు రోజులుగా..

8 Dec, 2021 20:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పరిచయం ఉన్న ఓ మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు ఐదుగురు వ్యక్తులు. చివరకు ఆ బాలిక చాదర్‌ఘట్ వద్ద ఉందని సమాచారం అందుకున్న పోలీసులు తనకి చికిత్స అందించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చుదువుతున్న ఓ మైనర్‌ బాలిక కాలేజ్‌ కోసం ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత కనిపించకుండా పోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం వెతుకుతుండగా మూడు రోజుల తర్వాత, సుల్తాన్ బజార్‌లో చాదర్‌ఘాట్‌లో ఆటో డ్రైవర్‌ వద్ద దొరికింది. బాలిక ఫిర్యాదు ప్రకారం.. నిందితులలో ఓ వ్యక్తి బాలికకు తెలియడంతో ఆమెకు మాయ మాటలు చెప్పి తనని తీసుకెళ్లినట్లు తెలిపింది. 

మూడు రోజుల వ్యవధిలో ఐదుగురు వ్యక్తులు తనపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు నిందితుల్లో నలుగురు ఆటో డ్రైవర్లు కాగా, ఒకరు కార్పెంటర్‌ని పోలీసులు తెలిపారు.

చదవండి: పెళ్లి పేరుతో లైంగిక దాడి 

మరిన్ని వార్తలు