ఆదోనిలో పసిపాప కిడ్నాప్ కలకలం

3 Jun, 2021 14:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కర్నూలు: ఆదోనిలో పసిపాప కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుర్తు తెలియని మహిళ.. పసి పాపను కిడ్నాప్ చేసింది. అలసంద గుత్తి గ్రామానికి మహిళకు నిన్న డెలివరీ కాగా, పసిపాపకు ఇంజక్షన్ ఇస్తానంటూ ఓ మహిళ తీసుకెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

చదవండి: ‘గుట్ట’ కాయస్వాహా: టీడీపీ నేత భూ బాగోతం.. 
ప్రేమించి.. లోబర్చుకుని.. జాబ్‌ వచ్చాక కాదన్నాడు

మరిన్ని వార్తలు