రాంగ్ రూట్‌లో వచ్చి బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం.. 15 మందికి గాయాలు

30 Nov, 2022 11:44 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బహ్రాయిచ్‌లో బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పే సిపా సమీపంలో రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  వీరందరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

బస్సు జైపూర్ నుంచి బహ్రాయిచ్‌ వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష‍్యమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. ఈ విషాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
చదవండి: 'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా'

మరిన్ని వార్తలు