బీకాం విద్యార్థిని ఆత్మహత్య.. తల్లిదండ్రుల మాటలే..

5 Oct, 2022 06:55 IST|Sakshi
పవిత్ర (ఫైల్‌)  

సాక్షి, బెంగళూరు(తుమకూరు): చదువులో రాణించలేననే భయంతో  ఓ యువతి సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తుమకూరు తాలూకా బెళ్లావిలో పవిత్ర (18) అనే విద్యార్థిని బీకాం డిగ్రీ మొదటి ఏడాది చదువుతోంది.

అయితే ఎప్పుడు ఆటలాడుతూ సమయం వృథా చేస్తావా? చదువుకో అని తల్లిదండ్రులు చెప్పిన మాటలే ఆ పవిత్రకు చేదుగా అనిపించాయి. దీనికి తోడు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు కోపడుతారని, అలాగే మొబైల్‌ కొనివ్వరని మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకుందని పోలీసులు తెలిపారు.

చదవండి: (రోడ్డు ప్రమాదంలో డాక్టర్‌ ఎస్‌.పి.నాయుడు మృతి) 

మరిన్ని వార్తలు