ఆటోను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి.. మరో ఇద్దరూ..

10 Jan, 2023 14:47 IST|Sakshi

పాట్నా: బిహార్ కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఆటో ఢీకొట్టి కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. 

సోమవారం రాత్రి 8:30 గంటలకు జాతీయ రహదారి-81 పై ఈ ప్రమాదం జరిగింది. ఆటోను ఓవర్‌టేక్ చేయిబోయిన ట్రక్కు దాన్ని ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆటోలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు.

ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం చెందిన స్థానికులు రోడ్డుపై టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రహదారిని దిగ్బంధించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగంలోకి దిగి వాళ్లను శాంతింపజేశారు. ట్రక్కు, డ్రైవర్‌ను వీలైనంత త్వరగా పట్టుకుంటామన్నారు.
చదవండి: రోడ్డును కమ్మేసిన పొగమంచు.. ట్రక్కు-బస్సు ఢీ.. నలుగురు దుర్మరణం

మరిన్ని వార్తలు