ఘోర రోడ్డు ప్రమాదం.. క్షణాల్లోనే..

21 Nov, 2020 16:47 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటిపై వెళ్తున్న యువతి రోడ్డు దాటే క్రమంలో యాక్సిడెంట్‌కు గురైంది. ఆ సమయంలో తనతో ఓ పాప కూడా ఉంది. అత్యంత వేగంగా దూసుకొచ్చిన బైకర్‌ వారిని ఢీకొట్టడంతో ఇద్దరూ గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. బైకర్‌ సైతం తీవ్రగాయాల పాలయ్యాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు వీరిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. (చదవండి: రోడ్డు ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం)

కాగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గురైన ముగ్గురు మైనర్లే కావడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ధర్మపురి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.(చదవండి: మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం )

మరిన్ని వార్తలు