మాట్లాడుకుందామని యువతిని లాడ్జికి రమ్మన్నాడు.. ఆ తర్వాత..

14 Nov, 2021 09:50 IST|Sakshi
ప్రతీకాత్మ‍క చిత్రం

సాక్షి, విశాఖపట్నం: ఒక యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన విశాఖ పట్నంలో కలకలంగా మారింది. హర్షవర్ధన్‌ రెడ్డి అనే యువకుడు.. యువతిని మాట్లాడేందుకు రమ్మని లాడ్జికి రమ్మన్నాడు. ఈ క్రమంలో లాడ్జికి చేరుకున్న యువతిపై.. పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. తన ప్రేమను నిరాకరించినందుకే హర్షవర్ధన్‌ రెడ్డి  దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన విశాఖలోని శ్రీ రాఘవేంద్ర లాడ్జిలో  నిన్న సాయంత్రం జరిగింది. 

హన్మకొండకు చెందిన యువకుడు హర్షవర్ధన్‌ రెడ్డి, విశాఖకు చెందిన సదరు యువతి పంజాబ్‌లో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. ఈ క్రమంలో యువకుడు నిన్న యువతిని లాడ్జికి రమ్మన్నాడు. వారి మధ్య గొడవ సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో యువకుడు యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. 

లాడ్జిరూమ్‌ నుంచి పొగలు రావడంతో.. సిబ్బంది మంటలను ఆర్పేశారు. పోలీసులకు సమాచారం అందించి.. గాయపడిన ఇద్దరిని విశాఖలోని కింగ్‌ జార్జ్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు