నిజామాబాద్‌లో కిడ్నాప్‌ కలకలం

25 Aug, 2020 09:32 IST|Sakshi

కిడ్నాపర్‌కు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

సాక్షి, నిజామాబాద్‌: బిడ్డను ఎత్తుకుపోయినోడు వెతగ్గా వెతగ్గా దొరికాడు.అంతే చెట్టుకు కట్టి ఉతికి పారేశారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. నవీపేట మండలం దండిగుట్టకు చెందిన లక్ష్మి అనే మహిళ ఈ నెల 11న బస్టాండ్‌లో వుండగా...బాసరకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మాటలు కలిపాడు. ఆ తర్వాత ఆమె ఏడాదిన్నరబాబును ఎత్తుకుపోయాడు.

బిడ్డ కోసం 15 రోజులు వెతికి వేసారి పోయిన లక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులకు చివరికి నిజామాబాద్‌ మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద నాగరాజు కన్పించాడు. బిడ్డ ఎక్కడున్నాడో చెప్పమంటూ చెట్టుకు కట్టి గ్రామస్తులు నాగరాజును చితక్కొట్టారు. ఆ రోజే తన వద్ద బాబును ఎవరో ఎత్తుకెళ్లారంటూ సమాధానం చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. బిడ్డ జాడ మాత్రం ఇంతవరకు దొరకలేదు. 

 

మరిన్ని వార్తలు