మరణంలోనూ వీడని బంధం
సాక్షి బళ్లారి: వారిద్దరూ ఒకే తల్లి రక్తం పంచుకొని జన్మించారు. ఆత్మీయ అన్నదమ్ములుగా గుర్తింపు పొందారు. అయితే అన్న గుండెపోటుతో మృతి చెందగా 13 గంటల వ్యవధిలోనే సోదరుడు కూడా గుండెపోటుతో మృతి చెందాడు. బళ్లారి తాలూకా హలకుందిలో రైతు కుటుంబానికి చెందిన సిద్దేశ్(22)కు గురువారం రాత్రి గుండెపోటుతో పాటు పక్షవాతం కూడా వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మరణించాడు.
ఈ విషయం తెలియడంతో బెంగళూరులో ఇంజినీర్గా పని చేస్తున్న సోదరుడు దొడ్డబసప్ప(25) బళ్లారికి వచ్చారు. సోదరుని మృతదేహాన్ని చూసి విలపిస్తూ మౌనంగా ఉండేపోయారు. అంత్యక్రియలు ముగించి ఇంటికి తిరిగి వస్తుండగా దొడ్డబసప్పకు కూడా ఛాతీనొప్పి రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందారు. మరణంలోనూ అన్నదమ్ములు ఒక్కటై తిరిగిరానిలోకాలకు తరలివెళ్లడంతో కుటుంబ సభ్యులే కాకుండా గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.