Hyderabad: బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య.. తల్లిదండ్రులు వరంగల్‌లో..

2 Feb, 2022 20:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో నివసించే బత్తిని సోహన్‌ సిద్ధ అనే బీటెక్‌ విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు వరంగల్‌లో బంధువుల పెళ్లికి వెళ్లొచ్చేసరికి సిద్ధ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

చదవండి: (హోటల్‌లో స్నేహితురాలితో ఏకాంత వీడియో.. ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవడంతో)

మరిన్ని వార్తలు