కాలేజ్‌ బిల్డింగ్‌ పైనుంచి దూకి బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

14 Nov, 2022 13:18 IST|Sakshi

నిజామాబాద్: బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. నిజామాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో బీటెక్‌ చదువుతున్న అర్పిత అనే విద్యార్థిని నిన్న(ఆదివారం) సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది.

కళాశాల బిల్డింగ్‌పై నుంచి దూకి సూసైడ్‌ చేసుకోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు