గంగానది కెనాల్‌లోకి దూసుకెళ్లిన కారు

8 Aug, 2020 11:09 IST|Sakshi

లక్నో: ఉత్తప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘజియాబాద్‌ జిల్లాలోని గంగానది కెనాల్‌లోకి ఓ కారు దూసుకెళ్లింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి కారులో ఉన్న నలుగురిలో ఒక్కరిని రక్షించగా, మరో ముగ్గురు కారులోనే చిక్కుకొని కెనాల్‌లో గల్లంతయ్యారు. గల్లంతైన ముగ్గురి కోసం రెస్క్యూ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదానికి గురైనవారు బరేలీ నుంచి చంఢీఘర్‌కి వెళ్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు