YS Viveka Case: సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు

22 Feb, 2022 19:00 IST|Sakshi
బాధితుడు ఉదయ్‌కుమార్‌ రెడ్డి

కడప(వైఎస్సార్‌ జిల్లా): కడప కోర్టు ఆదేశాలతో సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదైంది. 195ఏ, 323, 506, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రామ్‌సింగ్‌ తనను బెదిరిస్తున్నారంటూ యురేనియం కార్పొరేషన్‌ ఉద్యోగి ఉదయ్‌కుమార్‌ రెడ్డి కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడంతో ఉదయ్‌కుమార్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో రామ్‌సింగ్‌పై కడప రిమ్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌కు వినతిపత్రం ఇస్తున్న గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి(ఫైల్‌ఫోటో)

చదవండి: సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారు..

‘సీబీఐ చార్జిషీట్‌ను చాలెంజ్‌ చేస్తాం.. ప్రజలకు వాస్తవాలు తెలియాలి’

మరిన్ని వార్తలు