కుప్పం పోలీస్‌స్టేషన్‌లో అచ్చెన్నాయుడిపై కేసు నమోదు

28 Jan, 2023 10:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్‌స్టేషన్‌లో అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. నిన్న కుప్పం బహిరంగ సభలో పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుప్పం ఎస్‌ఐ శివకుమార్‌ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కాగా, యువగళం పాదయాత్ర మొదటరోజే తేలిపోయింది. దాదాపు రెండు నెలలుగా ఆహా..ఓహో.. అంటూ ఊదరగొట్టినా.. జనాలను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. శనివారం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్రకు స్పందన అంతంతమాత్రంగా కనిపించింది. ఆయన కుప్పంలోని లక్ష్మీపురం నుంచి పాదయాత్ర ప్రారంభించగా.. సాయంత్రం కమతమూరు సమీపంలో జరిగిన బహిరంగ సభ జనాలు లేక వెలవెలబోయింది.
చదవండి: లోకేశ్‌ పాదయాత్ర: ఎక్కడికక్కడ గొడవలకు దిగండి.. చంద్రబాబు కుయుక్తులు?

మరిన్ని వార్తలు