G Pulla Reddy Grandson Case: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడిపై కేసు పెట్టిన భార్య

14 May, 2022 16:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పుల్లారెడ్డి స్వీట్స్‌ అధినేత జి. పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్‌ రెడ్డిపై కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో గృహ హింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ కేసుకు సంబంధించి వివరాల ప్రకారం.. ఏక్‌నాథ్ రెడ్డికి ఆయన భార్య ప్రగ్యారెడ్డికి మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏక్‌నాథ్ రెడ్డి.. ఆయన భార్యను ఇంట్లో నుంచి బయటకు రానివ్వడంలేదని తెలుస్తోంది. అంతేకాకుండా తన భార్యను ఇంట్లోనే ఉంచి బయటకు ఆమె బయటకు రాకుండా ఉండేందుకు రాత్రికే రాత్రే రూమ్‌కు అడ్డంగా ఓ గోడను కట్టి ఇంటికి తాళం వేసి పారిపోయాడని బాధితురాలు(ఏక్‌నాథ్‌ రెడ్డి భార్య) ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.  ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల చట్టంతో పాటు గృహ హింస కేసు నమోదు చేసినట్టు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు