చైనా లోన్‌ యాప్స్‌: వెలుగులోకి కొత్త కోణం

28 Sep, 2021 16:30 IST|Sakshi

హైదరాబాద్‌: చైనా లోన్‌ యాప్స్‌ స్కాంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ సైబర్‌ స్టేషన్‌(సీసీఎస్‌)పోలీసులు లోన్‌ యాప్స్‌ ప్రతినిధులపై  కేసును నమోదు చేశారు. కాగా, లోన్‌ యాప్స్‌ పేరుతో కొత్త పద్ధతిలో కొన్ని గ్యాంగ్‌లు.. రూ. 5 వేల కోట్లని అక్రమమార్గంలో చైనాకు తరలించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈడీ) అధికారులు గుర్తించారు.

ఈ ముఠా విమానాల ద్వారా పెద్ద మొత్తంలో వస్తువులు దిగుమతి చేసుకున్నట్లుగా నకిలీ బిల్లులు సృష్టించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బిల్లులను పరిశీలించగా ఈ గ్యాంగ్‌ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు రూ.450 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసినట్లు నకిలీ పత్రాలను సృష్టించినట్లు అధికారులు కనుగొన్నారు. ఈ మేరకు లోన్‌ యాప్స్‌ ప్రతినిధులపై కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్‌ విన్యాసాలు: ‘క్రిమినల్‌ కేసు నమోదు’

మరిన్ని వార్తలు