ఫేక్‌ పోస్టులపై సీఐడీ విచారణ

23 Sep, 2022 06:30 IST|Sakshi

అధికారుల అదుపులో ఓ వ్యక్తి 

సాక్షి, అమరావతి :  ఉద్దేశపూర్వకంగా సోషల్‌ మీడియాలో ఒక ఉన్నతాధికారిపై దుష్ప్రచారానికి పాల్పడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన కొల్లు అంకబాబును గురువారం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతూ ఓ మహిళ విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువస్తుండగా, కేంద్ర డీఆర్‌ఐ అధికారులు ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో గుర్తించారు.

దీనితో ఏమాత్రం సంబంధంలేని ఒక ఉన్నతాధికారికి ఈ ఉదంతాన్ని ఆపాదిస్తూ కొల్లు అంకబాబు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో సీఐడీ సైబర్‌ క్రైమ్‌ విభాగం అధికారులు కేసు నమోదు చేశారు. ఆ పోస్టులు పెట్టిన అంకబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు