ప్రజల పైకి దూసుకొచ్చిన ట్రక్‌...నలుగురు మృతి

5 Oct, 2022 18:41 IST|Sakshi

జార్ఖండ్‌: దసరా వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. బోగ్గుతో కూడిన ట్రక్‌ ప్రజలపైకి దూసుకురావడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో చోటు చేసుకుంది. ఈ ట్రక్‌ అతి వేగంగా వస్తూ ఇద్దరు వాహనదారులను ఢీ కొట్టి మరికొంతమంది ప్రజలపైకి దూసుకొచ్చిందని తెలిపారు.

ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోగా, మరికొంతమందికి తీవ్ర గాయలపాలైనట్లు తెలిపారు. దసరా సందర్భండా ఆ కుటుంబం హాయిగా గడిపేందుకు బయటకు రావడంతో ఈ ప్రమాదం బారిన పడినట్లు పేర్కొన్నారు. పోలీసులు సదరు ట్రక్‌ని సీజ్‌ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

(చదవండి: ప్రమాదవశాత్తు రైఫిల్‌ కాల్పుల్లో వ్యక్తి మృతి)

మరిన్ని వార్తలు