చాక్లెట్ల దొంగతనం వైరల్‌ కావడంతో... విద్యార్థిని ఆత్మహత్య

31 Oct, 2022 19:10 IST|Sakshi

కోల్‌కతా: దొంగతనం చేసిన ఘటన సోషల్‌ మాధ్యమంలో వైరల్‌ అయ్యిందన్న అవమానంతో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...సదరు విద్యార్థి డిగ్రి మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె సెప్టెంబర్‌ 29న తన చెల్లెలుతో కలసి ఒక షాపింగ్‌ మాల్‌కి వెళ్లింది.

ఆ సమయంలో సదరు విద్యార్థిని కొన్ని చాక్లెట్లను దొంగతనం చేస్తూ పట్టుబడింది. ఐతే ఆ తర్వాత ఆమె సదరు షాపు యజమానికి క్షమాపణలు చెప్పి బిల్‌ పే చేసి వచ్చేసింది. కానీ ఆ ఘటనను సదరు షాపు వాళ్లు వీడియో తీసి సోషల్‌ మాధ్యమంలో పోస్ట్‌ చేశారు. దీంతో తన కూతురు ఈ అవమానాన్ని భరించలేకా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు బాధితురాలి తండ్రి ఆవేదనగా చెబుతున్నారు.

స్థానికులు ఆమె మృతదేహాన్ని సదరు షాపు వద్ద ఉంచి ఆందోళనకు దిగారు. అంతేగాదు ఆ వీడియోని ఆన్‌లైన్‌ పోస్ట్‌ చేసి ఆమె మృతికి కారణమైన వాళ్లని గట్టిగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడమే గాక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

(చదవండి: ఉరి సీన్‌ రిహార్సల్‌లో విషాదం.. పిలగాడు మృతి)

మరిన్ని వార్తలు