కాలేజీకి వెళ్లిన యువతి మిస్సింగ్‌.. తిరిగి ఇంటికి రాకపోవడంతో..

21 Mar, 2022 08:14 IST|Sakshi
మౌనిక(ఫైల్‌)

మదనపల్లె టౌన్‌(చిత్తూరు జిల్లా): మండల పరిధిలో కళాశాల విద్యార్థిని అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు, మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ వైఎస్సార్‌ కాలనీకి చెందిన  మౌనిక(19), స్థానిక కోమటివాని చెరువు సమీపంలోని కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఈ నెల 19న కళాశాలకు వెళ్లిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆదివారం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ఎస్‌ఐ -9440796741కు సమాచారం ఇవ్వాలని కోరారు.
చదవండి: ప్రేమించిన యువతి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య..

మరిన్ని వార్తలు