Sidhu Moose Wala Death: కాంగ్రెస్ నేత, సింగర్ సిద్ధూ దారుణ హత్య

29 May, 2022 18:59 IST|Sakshi

చంఢీగడ్‌: కాంగ్రెస్ నేత, ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మాన్సా జిల్లాలోని జవహర్ కే గ్రామంలోని ఒక దేవాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాన్సాలోని సివిల్ ఆసుపత్రిలో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వివరాల ప్రకారం .. జవహర్‌ కే గ్రామం వైపు సిద్ధూ జీపులో వెళ్తుండగా కొందరు దుండగులు ఆయనపై 20 రౌండ్ల కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో సిద్ధూతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయ. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిద్ధూని అస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన సిద్ధూ చికిత్స పొందుతూ మృతి చెందారు. పంజాబ్‌లో వీఐపీలకు భద్రతను శనివారమే ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటన పంజాబ్‌లో కలకలం రేపుతోంది.

మరిన్ని వార్తలు