స్పాసెంటర్‌ యువతులపై పోలీసుల అత్యాచారం..

28 Nov, 2021 20:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చంఢీఘడ్‌: హర్యానాలోని రేవారిలో దారుణమైన ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు..  ఇద్దరు యువతుల పట్ల అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గత గురువారం (నవంబరు25)..  కానిస్టేబుల్‌ అనిల్‌, హోంగార్డు జితేంద్ర, అతని మిత్రుడు ధర్మేంద్ర స్థానికంగా ఉన్న  స్పా మసాజ్‌ సెంటర్‌పై దాడిచేశారు.

ఆ తర్వాత అక్కడ  పనిచేస్తున్న ఇద్దరు యువతులను బలవ‍ంతంగా బయటకు లాక్కొచ్చి వారి వాహనంలో ఎక్కించారు. ఈ క్రమంలో వారిని ఒక హోటల్‌కు తరలించారు. ముగ్గురు పోలీసులు కలిసి యువతులపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో స్పాసెంటర్‌ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.   

మరిన్ని వార్తలు