వివాహేతర సంబంధం.. జంట ఆత్మహత్య 

16 Apr, 2021 09:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టీ.నగర్‌/చెన్నై: తోగైమలై సమీపంలో ఓ వివాహేతర జంట ఆత్మహత్య చేసుకుంది. కరూరు జిల్లా, తోగైమలై సమీపంలోగల కలింగపట్టికి చెందిన కందస్వామి కుమార్తె శివభాగ్యం (22). ఈమె భర్త సతీష్‌తో విడాకులు పొంది తండ్రి కందస్వామితో నివసిస్తోంది. రెండు నెలల క్రితం కరూరు కోర్టులో సహాయకురాలిగా శివభాగ్యం పనిలో చేరింది. తోగమలై సమీపంలోగల నాగనూరు పంచాయతీ నల్లాగౌండన్‌పట్టికి చెందిన ఆర్ముగం(36). వివాహితుడైన ఇతనితో శివభాగ్యంకు సంబంధం ఏర్పడింది. ఇరు కుటుంబాలు ఇద్దరిని మందలించాయి.  ఆర్ముగం, శివభాగ్యం మనస్తాపం చెంది బుధవారం రాత్రి ఆర్ముగం తోటకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగారు. శివభాగ్యం మృతిచెందింది. శివభాగ్యం దుపట్టాతో చెట్టుకు ఆర్ముగం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  

థియేటర్‌పై పెట్రోల్‌ బాంబుతో దాడి 
తిరువొత్తియూరు : తూత్తుకుడిలోని ఓ సినిమా థియేటర్‌పై పెట్రోల్‌ బాంబుతో దాడి చేసిన నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తూత్తుకుడి గోల్పురంలోని ఓ థియేటర్‌లో ధనుష్‌ నటించిన కర్ణన్‌ సినిమా ఇటీవలే విడుదలైంది. బుధవారం రాత్రి సెకెండ్‌ షో జరుగుతుండగా మద్యం మత్తులో అక్కడకు వచ్చిన ఐదుగురు యువకులు థియేటర్‌పై పెట్రోల్‌ బాంబులు విసిరారు. థియేటర్‌ మేనేజర్‌ అరుణాచలం ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీని పరిశీలించగా రాజీవ్‌నగర్‌కు చెందిన ఆంథోని అరవింద్‌(20), ఆంథోని రాజు(20), ఐటీఐ విద్యార్థి మరుగనాయకం, కారు డ్రైవర్‌ సుకుమార్‌ను నిందితులుగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: ఒక్కదాన్నే ఉన్నా.. నువ్వు రా; ఇంటికి పిలిపించి కాటికి పంపారు

మరిన్ని వార్తలు