గొడవతో మహానదిలో దూకిన దంపతులు.. అంతలోనే..

5 Jun, 2021 09:27 IST|Sakshi
దంపతులను కాపాడి నది ఒడ్డుకు చేర్చిన సహాయక సిబ్బంది

కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

భువనేశ్వర్‌/ కటక్‌: కటక్‌ ప్రాంతంలోని జోబ్రా తీరంలో మహానదిలో శుక్ర వారం దంపతులు దూకేశారు. స్థానికుల సమాచారం మేరకు  అగ్ని మాపక దళం సంఘటనా స్థలానికి వచ్చి నదిలో గాలించి ఆ దంపతులను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చి స్థానిక ఎస్సీబీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు. వారి  ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు, పోలీసులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. తొలుత నదిలో దూకిన భార్య  స్వల్పంగా గాయపడింది. భార్యను కాపాడేందుకు భర్త వెంటనే మహానదిలో దూకినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనకు ముందు ఇద్దరి  మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దంపతులు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలియాల్సి ఉంది.

చదవండి: ఘోరం.. కారులోనే ముగ్గురు సజీవదహనం
చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్‌

మరిన్ని వార్తలు