Bellampalli: ఐసోలేషన్‌ కేంద్రంలో 12 మంది మృతి

7 May, 2021 09:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మంచిర్యాల జిల్లాలో కరోనా విజృంభణ 

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో రెండ్రోజుల వ్యవధిలో 12 మంది మృత్యువాతపడ్డారు. కొద్ది గంటల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టించింది. బెల్లంపల్లి కేంద్రంగా సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఐసోలేషన్‌ కేంద్రం నిర్వహిస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ తీవ్ర రూపం దాల్చడంతో జిల్లాలో రోజూ దాదాపు 500 కేసులు నమోదవుతున్నాయి.

కాగా అనేక మంది రెండు మూడు రోజుల వ్యవధిలోనే తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితి లో ఐసోలేషన్‌ కేంద్రంలో చేరుతున్నారు. ఆక్సిజన్‌ స్థాయి 50 శాతానికి పడిపోయిన రోగులు ఆస్పత్రిలో చేరిన కొద్ది గంటల వ్యవధిలోనే చనిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 8 మంది, ఆ తర్వా త సాయంత్రం 7 గంటల వరకు మరో నలుగురు వ్యక్తులు కరోనాతో కన్నుమూశారు. 

మరిన్ని వార్తలు