పార్శిల్‌లో రూ.4.45 కోట్ల విలువైన వజ్రాలు

13 Mar, 2022 08:23 IST|Sakshi

చెన్నై విమానాశ్రయంలో స్వాధీనం

సాక్షి, చెన్నై: శ్రీలంక నుంచి చెన్నైకు వచ్చిన పార్శిల్‌లో రూ.4.45 కోట్ల విలువైన వజ్రాలు, రత్నాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం వచ్చింది. ఇందులో వచ్చిన పార్శిల్‌పై అధికారులకు అనుమానం కలిగింది. చెన్నైకు చెందిన ఓ పారిశ్రామివేత్త చిరునామాతో రావడం.. రూ.5.85 లక్షల విలువైన సెమీ వజ్రాలు ఉన్నట్లు రశీదులో పేర్కొని ఉండటంతో అనుమానంతో తెరిచి చూశారు.

అందులో ఉన్న వజ్రాలు, రత్నాలను నిపుణుల ద్వారా పరీక్షించగా, వాటి విలువ రూ.4.45 కోట్లుగా తేలింది. దీంతో చెన్నైలోని ఆ పారిశ్రామికవేత్తను కస్టమ్స్‌ అధికారులు విచారించే పనిలో పడ్డారు.

మరిన్ని వార్తలు