బెళగావిలో రూ.94 లక్షలు హ్యాక్‌

4 Jul, 2021 10:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, యశవంతపుర(కర్ణాటక): అకౌంట్లను హ్యాక్‌ చేసి రూ.94.72 లక్షలను దోచిన అంతర్జాతీయ ముఠాకు చెందిన ముగ్గురిని బెళగావి జిల్లా సదలగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైలో ఉండే నైజీరియా వాసి ఉజకా పీటర్‌గోజి(40), మహారాష్ట్రవాసులు హరిశంకర పాండే (28), అభిజిత్‌ ఘనశ్యామ్‌ మిశ్రా(27)లను అరెస్ట్‌ చేశారు. బెళగావి జిల్లా నిప్పాణి తాలూకా బోరగాం అరిహంత సహకార బ్యాంక్‌కు చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షలను ఈ ముఠా మే 28న డ్రా చేసింది.

జూన్‌ 3న శమనెవాడిలోని అరిహంత సహకార బ్యాంక్‌లో సేవింగ్స్‌ ఖాతాలో ఉన్న రూ.79 లక్షలకు పైగా నగదును బదిలీ చేసుకుంది. భారీగా డబ్బులు మాయం కావడంపై బ్యాంక్‌ మేనేజర్‌ అశోక సదలగా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తుచేసి ముంబైలో మోసగాళ్లను పట్టుకున్నారు. 

చదవండి: దావణగెరెలో మిస్సి కాటు బాలిక మృత్యువాత  

మరిన్ని వార్తలు