దర్భంగా కేసు: "రా" ఏజెంట్‌ను అంటూ..

4 Jul, 2021 11:51 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌ : దర్భంగా బ్లాస్ట్‌కు సంబంధించి మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాలిక్‌ తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటంపై కుటుంబ సభ్యుల ఆరా తీయగా..  తాను ఇండియన్‌ ‘‘రా’’ ఏజెంట్‌ను అంటూ కుటుంబ సభ్యులను నమ్మించాడు. నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ ఖాన్‌​​లు కుటుంబాన్ని మోసం చేసి ఉగ్ర కార్యాచరణ చేపట్టారు. తాను "రా" పనిపై పాక్ వెళ్తున్నట్లు చెప్పి.. పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదుల వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. 2012లో 4 నెలలపాటు పాకిస్తాన్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఐఈడీ అమర్చడంలో నాసిర్‌ మాలిక్ మాస్టర్ మైండ్‌.

సోదరులిద్దరూ 2016లో దుబాయ్ వెళ్లారు. కాగా,  ఢిల్లీ ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు.  దర్భంగా బ్లాస్ట్‌ వెనుక భారీ కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాస్ట్‌కు ముందు మాలిక్‌ సోదరుల కదలికలపై ఎన్‌ఐఏ విచారణ చేస్తోంది.

మరిన్ని వార్తలు