సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసు: వ్యక్తి లొంగుబాటు

24 Sep, 2020 16:22 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నకిలీ చెక్కులు సృష్టించిన భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి ప్రొద్దుటూరు పోలీసుల ముందు గురువారం లొంగిపోయారు. 25 వేల విలువ గల మూడు పాత చెక్కులను మార్ఫింగ్‌‌ చేసి 9 లక్షల 95 వేలతో నిందితుడు దొంగ చెక్కులను తయారు చేశాడు. కర్ణాటకలోని హోసూర్‌లో ఉండే సుబ్బిరామిరెడ్డి ద్వారా చెక్కులను మార్పింగ్‌ చేశారు. నకిలీ చెక్కులను గుర్తించిన బ్యాంకుల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బండారం గుట్టురట్టయిం ఈ కేసును ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాకర్‌ లోతుగా విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు