సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో డ్రగ్స్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 155 గ్రాముల నిషేధిత హపీస్ ఆయిల్ను కలిగి ఉన్న ఐదుగురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్పల్లి, మల్కాజ్గిరి ఏరియాల్లో నిందితులు డ్రగ్స్ను విక్రయిస్తున్నారు. సాయిరెడ్డి, విక్రమ్ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి.. కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. కాగా, సాయిరెడ్డి, విక్రమ్ పరారీలో ఉన్నారు. అరెస్టయిన వ్యక్తులు డ్రగ్స్ కు బానిస అయినట్లు పోలీసులు తెలిపారు. అరకు ఏజెన్సీ ప్రాంతాల నుంచి హషీస్ ఆయిల్ను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.