Jangaon: మందుబాబు ప్రాణం తీసిన ఆమ్లెట్‌.. గొంతులో ఇరుక్కొని..

4 Nov, 2022 12:44 IST|Sakshi

మద్యం తాగేందుకని ఓ వ్యక్తి వైన్​ షాపుకెళ్లాడు. తనకు నచ్చిన బ్రాండు తీసుకుని పక్కనే ఉన్న పర్మిట్​ రూమ్​(మద్యం తాగేందుకు అనుమతి గది)లోకి వెళ్లాడు. ఖాళీగా ఉన్న ఓ టేబుల్​ చూసుకుని కూర్చున్నాడు. బాటిల్​ ఓపెన్​ చేసి.. ఓ పెగ్గు కలిపాడు. అప్పుడు గుర్తొచ్చింది మనోడికి మంచింగ్​ సంగతి. మందు ఓకే.. మరి మంచింగ్​ ఏం తీసుకుందాం అని కాసేపు ఆలోచిస్తే.. మరీ కాస్ట్​లీవి మనకెందుకనిఓ ఆమ్లెట్​తో సరిపెట్టేద్దాంలే​ అనుకుని ఆర్డర్​ ఇచ్చాడు. వేడివేడిగా ఆమ్లెట్​ టేబుల్​పైకి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం అనుకుని ఓ పెగ్గేశాడు. వేడివేడి ఆమ్లెట్​ను​ తీసుకుని అలా నోట్లో పెట్టుకున్నాడు. అంతే.. అదే ఆమ్లెట్​ యమపాశమై మనోడి ప్రాణాలను తీసేసింది.

జనగామ జిల్లా బచ్చన్నపేటలో  ఈ ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్‌రెడ్డి (38) స్థానిక మద్యం దుకాణంలోని అనుమతి గదిలో కూర్చొని మద్యం తాగుతున్నాడు. తాను తింటున్న ఆమ్లెట్‌ గొంతులో ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ప్రాణం తీసిన ఆమ్లెట్‌.. మందు తాగుతుండగా గొంతులో ఇరుక్కొని..

మరిన్ని వార్తలు