ఫరూఖ్‌ అబ్దుల్లాకు షాక్‌ ఇచ్చిన ఈడీ

19 Dec, 2020 20:09 IST|Sakshi

11.86 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్‌ చేసిన ఈడీ 

శ్రీనగర్‌ : నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్‌ ఇచ్చింది. జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మనీ ల్యాండరింగ్‌ కేసుకు సంబంధించి జమ్మూ, శ్రీనగర్‌లలోని 11.86 కోట్ల రూపాయల ఆయన ఆస్తుల్ని అటాచ్‌ చేసింది. ఈ మేరకు శనివారం తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. అటాచ్‌ చేసిన వాటిలో రెండు ఇళ్లు, ఓ వ్యాపార భవనం, మూడు స్థలాలు ఉన్నాయి. ఈడీ వాటి విలువను 11.86 కోట్ల రూపాయలకు లెక్కగట్టినప్పటికి, మార్కెట్‌ విలువ 60-70 కోట్ల రూపాయలుగా ఉంటుందని సమాచారం. ( పరువు నష్టం: సారీ చెప్పిన సీనియర్‌ నేత )

కాగా, ఇదే కేసుకు సంబంధించి ఫరూఖ్‌ అబ్దుల్లా పలుమార్లు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఫరూక్‌ అబ్దుల్లా సహా పదిమంది జేకేసీఏ కార్యవర్గ సభ్యులు సంస్థను రుణాల జారీ సంస్థగా మార్చేశారని, ఈ కుంభకోణం వెలుగుచూసిన 2005-12లో పలు బోగస్‌ ఖాతాలను నిర్వహించారని ఈడీ ఆరోపించింది. 

మరిన్ని వార్తలు